![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -249 లో..... సాగర్, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మదకి వెక్కిళ్లు వస్తుంటే.. ఎవరో నిన్ను గుర్తుచేసుకుంటున్నారు.. మీ వాళ్ళు అయి ఉంటారని సాగర్ అంటాడు. వాళ్లకు నేను గుర్తు రానని నర్మద బాధగా అంటుంటే అప్పుడే నర్మదకి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది.
మా అమ్మ ఎప్పుడు ఫోన్ చెయ్యలేదు.. ఇప్పుడు చేస్తుందేంటని నర్మద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది అమ్మ అని తను చెప్పగానే నర్మద షాక్ అవుతుంది. నర్మద, సాగర్ ఇద్దరు వెంటనే హాస్పిటల్ కి వెళ్తారు. నర్మదపై వాళ్ళ నాన్న ఇంకా కోపంగా ఉంటాడు. అందరిలో మిల్ లో మూటలు మోస్తాడు. మీ అల్లుడు అంటే నా పరువు పోతుందని అతను అనగానే నేను ఏం చేస్తే నన్ను మీరు అల్లుడుగా ఒప్పుకుంటారని సాగర్ అడుగుతాడు. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఒప్పుకుంటానని అతను అనగానే అయితే త్వరలోనే గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని నర్మద వాళ్ళ నాన్నకి మాటిస్తాడు సాగర్. దాంతో వాళ్ళ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు నర్మద, ప్రేమ నన్ను ఎంత బాధపెట్టారు.. ఎలాగైనా వాళ్ళ అంతు చూడాలని శ్రీవల్లి అనుకుంటుంది. సాగర్ రాత్రి చదువుతున్నాడు కనిపెట్టాలి.. మరి ప్రేమ సంగతి అనుకుంటూ.. నిన్న ఏవో ఫోటోస్ దాచింది కదా అవేంటో కనుక్కోవాలని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ప్రేమతో కళ్యాణ్ ఉన్నా ఫొటోస్ పంపించడంతో.. వాడు మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చాడని ప్రేమ అనుకుంటుంది. ఆ తర్వాత ఎలాగైనా ఆ ప్రేమని నేను దక్కించుకోవాలని కళ్యాణ్ అనుకుంటాడు. ప్రేమ దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. అత్తయ్య నిన్ను రమ్మంటుందని పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |